GAP Line

Main Banner

Thursday, August 29, 2019

శాంతియుత వాతావరణంలో వినాయకచవితి జరుపుకోవాలి..


హత్నూర : శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జిన్నారం సిఐ లాలు నాయక్ అన్నారు. బుధవారం నాడు హత్నూర పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని ప్రతిష్టించే ముందు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని మండపాల విషయంలో ప్రభుత్వం నియమించే నియమ నిబంధనలు పాటించాలని వినాయకుని ప్రతిష్టించే నాటినుంచి నిమజ్జనం వరకు ఉత్సవ కమిటీల ఆధీనంలోనే ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ కమిటీ బాధ్యత తీసుకోవాలని, విద్యుత్తు డీజే లో విషయంలో అధికారులు సూచించిన విధంగా పాటించాలని, ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, కులమతాలకు అతీతంగా పండగ వాతావరణం ఉండేలా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హత్నూర ఎస్ఐ శ్రీనివాస్, వివిధ గ్రామాల యువజన నాయకులు, గ్రామ పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు.