GAP Line

Main Banner

Monday, September 23, 2019

నర్సాపూర్ పట్టణ అభివృద్దే నా లక్ష్యం



నర్సాపూర్ మునిసిపాలిటీలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు స్వయంగా తిరిగి పరిశీలించారు. 30 రోజుల ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా చేయాల్సిన పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో ప్రధాన మురికి కాలువ, సిసి రోడ్ల నిర్మాణానికి ఎస్టిమెంట్ రెడీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సునీతా రెడ్డితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, మురళి యాదవ్, అశోక్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.