GAP Line

Main Banner

Thursday, September 19, 2019

వైష్ణవి కళాశాలలో ఫ్రెషర్స్ డే



నర్సాపూర్ లో వైష్ణవి జూనియర్ కళాశాలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సాపూర్ సీఐ నాగయ్య గారు మాట్లాడుతూ రాబోయే భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఒక దేశం త్వరగా అభివృద్ధి సాదించాలంటే యువత మేధస్సు ఎక్కువగా ఉపయోగపడుతుందని అందరితో స్నేహ భావం తో మెలగాలని వృద్ధుల పట్ల గౌరవంతో చిన్న పిల్లల పట్ల ప్రేమతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. అ తరువాత విద్యార్థుల నృత్యాలు మరియు నాటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పృద్వి గౌడ్ తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.