GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Wednesday, October 16, 2019

నీటి సమస్యను పరిష్కరించండి



నీటి సమస్యను తీర్చాలని పట్టణంలోని శివాలయం వీధికి చెందిన పలువురు నాయకులు పురపాలక సంఘం ఈఓ శ్రీదేవిని కోరారు. ప్రధానంగా (శివాలయం) ఆలయం వద్ద నీటి సదుపాయం లేక వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈఓ శ్రీదేవిని వివరించారు. గతంలో పలుమార్లు నీటి సమస్య  పరిష్కారంపై అధికారుల దృష్టికి తెచ్చిన నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎంపీటీసీ సభ్యులు సంగసాని సురేష్ ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈఓను వినతిపత్రం అందజేశారు. ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈఓ శ్రీదేవి చెప్పారు. ఈ కార్యక్రమంలో కంది ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సంగసాని సురేష్,  రమేష్, ప్రేమ్ కుమార్, వినోద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.