GAP Line

Main Banner

Tuesday, March 31, 2020

మారు వేషంలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్



విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై ఆరా తీసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ అమలుతో జనాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం జనాలు రోజూ రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వం కూడా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినా అక్కడక్కడా వ్యాపారులు ధరలు పెంచారనే విమర్శలు వినిపించాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.. వ్యాపారులపై నిఘా పెంచారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రేట్లపై ఆరా తీసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించినట్లు కాకుండా.. ఇష్టానుసారంగా ధరలు పెంచారనే ఫిర్యాదులు రావడంతో.. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. అలాగే కొనుగోలుదారుల్ని అడిగి ధరల వివరాలు ఆరా తీశారు. కొన్ని కూరగయాల మార్కెట్లలో కొన్ని చోట్ల ధర కంటే రూ.5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు జాయింట్ కలెక్టర్. అధికారులతో చర్చించి.. రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే కొద్దిసేపటి తర్వాత మారు వేషంలో మార్కెట్‌కు వచ్చింది జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్‌ అని తెలుసుకుని షాక్ తిన్నారు.